Monday, June 1, 2009

కధ

కనువిప్పు

- సి. విజయేంద్ర బాబు

ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతడు చాలా సోమరిగా ఉండేవాడు. అతడికి చాలా పెద్ద పొలాలు ఉన్నాయి. అతడి పేరు రంగన్న. అతడు రోజూ పని చేసేవాడు కాడు. అతడు రోజూ ప్రోద్దున నుంచి రాత్రి దాకా నీరు మాత్రం వదిలేవాడు. ఒక సారి అలాగే నీరు వదిలేందుకు రంగన్న, అతని కొడుకు పొలానికి వెళ్ళినపుడు ఉన్నట్టుండి పెద్దగా వాన కురిసింది. అక్కడ గుంతలలో నీరు నిండిపోవడంతో రంగన్న అతని కొడుకు మునిగిపోయారు.


అదే సమయానికి దగ్గరలో ఉన్న వారి స్నేహితులు ఇది గమనించి వారిద్దరినీ బయటికి తీసి ఆసుపత్రి లో చేర్చారు. కోలుకున్న తరువాత రంగన్నకు కనువిప్పు కలిగింది. తమకు రోజూ పనిచేసే అలవాటు లేక, సోమరిగా ఉండటము వలన ప్రమాదము ఎదుర్కోవలసి వచ్చిందని తెలుసుకున్న రంగన్న, అతడి కొడుకు కష్టపడి పని చేయడం మొదలుపెట్టారు.

నీతి:- ఎప్పుడూ సోమరిగా ఉండకూడదు. అలా ఉంటే కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.

(సాహితి లో బాలసాహితి శీర్షికన ఈ కథ 11 మే 2009 న ప్రచురితమైనది)

కథ

కోతి తెలివి

సి. విజయేంద్ర బాబు

ఒక ఊరిలో ఒక కోతి ఉంది. అది చాలా తెలివైనది. అది ఒక పెద్ద మర్రిచెట్టు ఎక్కింది. అది మర్రి తొర్రను చూసింది. దానిలో పక్షులు కవకవ అరుస్తున్నాయి. ఎందుకు అరుస్తున్నాయా అని చూసింది. ఒక పాము చెట్టుపైకి ఎక్కడం చూసింది. కొమ్మపై కూర్చున్న గద్దను పిలిచింది.


"నీకు పామంటే ఇష్టం కదా" అంది.


" అవును" అంది గద్ద.


"మరి తిను" అంది కోతి.


గద్ద పామును పట్టుకొని ఎగిరింది. ఆవిధంగా కోతి తెలివితో పక్షి పిల్లల్ని కాపాడింది.


చేతకాని వారిని కష్టాలనుండి తప్పించడం మంచి గుణం.

(సాహితి లో బాలసాహితి శీర్షికన ఈ కథ 4 ఆగస్ట్ 2008 న ప్రచురితమైనది)