Sunday, March 7, 2010

చిన్న కథ




పశ్చాత్తాపం




ఒక ఊరిలో ఒకతను ఉండేవాడు. అతని పేరు ధనగుప్తుడు. అతనికి పిసినారితనం ఎక్కువ. నెలకు ఒక షాంపూ ప్యాకెట్ వాడుకునేవాడు. రోజుకు ఒక మెతుకు బియ్యం తినేవాడు. అందుకే అతడు బలహీనంగా తయారయ్యాడు. ఎవరినీ నమ్మకపోవడంతో ఉన్న ధనమంతా ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఒక రోజు అతని ఇంట్లో దొంగలు పడ్డారు . బలహీనంగా ఉండటంతో అతను ఏమీ చేయలేకపోయాడు. తినడానికి లేక అడుక్కు తినసాగాడు. డబ్బున్నపుడే బ్యాంకులో దాచుకొని ఉంటే తనకీ కష్టం వచ్చిఉండేది కాదని పశ్చాత్తాపం పడ్డాడు. కష్టం వచ్చాక పశ్చాత్తాప పడి ఏం లాభం?